Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కొత్త స్ట్రెయిన్‌.. దేశంలో వణికిపోతున్న ప్రజలు.. ఆరుగురికి పాజిటివ్

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (08:52 IST)
కరోనా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా దేశంలో బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఈ సంఖ్య 18 నుంచి 19 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జీనోమ్‌ సీక్వేన్సింగ్‌ ప్రయోగశాల గుర్తించినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇందులో బెంగళూరులో నిమ్హాన్స్‌ ప్రయోగశాలలో మూడు కేసులు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారించారు. ఆరుగురు బాధితులను ఐసోలేషన్‌ ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. 
 
అలాగే సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కు పంపేలా మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో నమోదైన కేసులో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తిలో వైరస్‌ గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లో ఓ మహిళకు వైరస్‌ సోకినట్లు సీసీఎంబీ నిర్ధారించింది. అలాగే తెలంగాణ వైద్యాధికారులు సైతం అధికారికంగా ధ్రువీకరించారు. అలాగే ఏపీలో రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళలో కొత్త రకం కరోనా వైరస్‌ లక్షణాలను అధికారులు కనుగొన్నారు.
 
యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 1423 మంది రాక.. ఏపీకి వచ్చిన వారిలో 12 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.. వారి నుంచి మరో 12 సన్నిహితులకు వైరస్‌ సోకిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 24 నమూనాలను సీసీఎంబీకి తరలించగా.. ఇందులో ఒకరికి యూకే వైరస్‌ నిర్ధారణ అయ్యింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments