Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (14:32 IST)
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా వ్యాపిస్తోంది. శుక్రవారానికి ఈ వైరస్ ఏకంగా 180 దేశాలకు విస్తరించింది. అలాగే, కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఇటలీలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. కరోనా మృతుల్లో చైనాను ఇటలీదాటిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10048గా నమోంది. ఇందులో ఒక్క ఇటలీలోనే ఏకంగా 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2.45 లక్షలకు చేరితే, ఒక్క ఇటలీలోనే 41 వేల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో గడిచిన 24 గంటల్లో 427 మంది మృతి చెందారు. చైనాలో వరుసగా రెండో రోజూ కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో చైనా పాలకులతో పాటు.. ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి  పీల్చుకున్నారు. 
 
ఇకపోతే, ఇరాన్‌లో 1,284, స్పెయిన్‌లో 831, ఫ్రాన్స్‌లో 372, అమెరికాలో 218, యూకేలో 144, దక్షిణ కొరియాలో 94, నెదర్లాండ్స్‌లో 76, జర్మనీలో 44, స్విట్జర్లాండ్‌లో 43 మంది మృతి చెందారు. అదేవిధంగా మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 195కు చేరుకోగా, మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వీరంతా 60 యేళ్ళ పైబడినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments