దేశంలో 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ కేసులు

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:28 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లో అనూహ్యంగా మంగళవారం రోజు 50 వేల దిగవకు పడిపోయిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇక, మృతుల సంఖ్య కూడా పెరిగి తాజాగా 717 మంది మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షల మార్క్‌ కూడా క్రాస్ చేసి 76,51,108కు చేరగా.. ఇప్పటి వరకు 1,15,914 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,40,090 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు కరోనాబారినపడినవారు గత 24 గంటల్లో 61,775 మంది కోలుకోగా... ఇప్పటి వరకు రికవరీ అయినవారి సంఖ్య 67,95,103కు పెరిగింది.. దేశంలో 88.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా... యాక్టివ్ కేసులు 9.67 శాతంగా ఉన్నాయి.. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిల్స్ పరీక్షించామని... టెస్ట్‌ల సంఖ్య 9,72,00,379కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments