Webdunia - Bharat's app for daily news and videos

Install App

550 మంది వైద్యులు కరోనాతో బలి.. ఢిల్లీలోనే అత్యధికంగా 104 మంది డాక్టర్లు

Webdunia
శనివారం, 29 మే 2021 (12:31 IST)
కరోనా మహమ్మారి వందల మంది ప్రాణదాతలను బలితీసుకుంటోంది. రెండో ఉద్ధృతిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 550 మంది వైద్యులు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య మండలి (ఐఎంఏ) శనివారం వెల్లడించింది.

అత్యధికంగా ఢిల్లీలో 104 మంది డాక్టర్లు కరోనాతో మృతిచెందగా.. ఆ తర్వాత బిహార్‌లో 96 మంది, ఉత్తప్రదేశ్‌లో 53, రాజస్థాన్‌లో 42, గుజరాత్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 29, పశ్చిమ బెంగాల్‌లో 23, తమిళనాడులో 21 మంది వైద్యులు వైరస్‌ కారణంగా చనిపోయినట్లు ఐఎంఏ తెలిపింది.
 
అయితే, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని వైద్య మండలి భావిస్తోంది. ఎందుకంటే.. ఐఎంఏ రికార్డుల ప్రకారం 3.5లక్షల మంది డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉండగా.. దేశవ్యాప్తంగా 12లక్షలకు పైనే వైద్యులు ఉన్నారు. ఇప్పటికే తొలి దశలో మొత్తం 748 మంది డాక్టర్లను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. వైద్యులు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోకపోవడం అధిక మరణాలకు దారితీస్తుండొచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments