Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 30వేల కరోనా కేసులు.. 4 నెలల్లో మొదటిసారి..

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (14:38 IST)
దేశంలో కరోనావైరస్ విజృంభణకు అడ్డుకట్టపడకపోయినా.. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా ఉంది. అయితే, నిన్న ఒక్కరోజే భారీ తగ్గుదల కనిపించింది. జులై 13 తరవాత ఒకరోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
అలాగే, ఆదివారం నిర్ధారణ పరీక్షల సంఖ్య (8,61,706) తగ్గడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. 
 
ఇక, నిన్న ఈ మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య 1,30,070కి చేరుకుంది. 88లక్షల పైచిలుకు మంది వైరస్‌ బారిన పడినప్పటికీ, వారిలో 82,49,579 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు, గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే ఉంటుంది. 
 
ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 5.26 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా..రోజూవారీ సగటు కేసుల సంఖ్య ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతున్నట్లు ఇటీవల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments