Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయతాండవం: బ్రెజిల్‌ను భారత్ దాటేస్తుందా?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (09:39 IST)
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా 24 గంటల్లో 37,148 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 40 వేలకు పైగా కేసులొచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1155191కి పెరిగింది. గత 24గంటల్లో 587 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28084కి చేరింది. 
 
ప్రస్తుతం భారత్‌లో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. అంటే ప్రతి 1000 మంది కరోనా సోకిన వారిలో... 24 మంది చనిపోతున్నారు. ఇక... గత 24 గంటల్లో 24491 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 724577కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 402529గా ఉంది. రికవరీ రేటు 62.7 శాతంగా ఉన్నా.... రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం విచారకరం. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ టాప్-3లో ఉండగా... రోజువారీ కేసుల్లో టాప్-2లో ఉంది. మొత్తం మరణాల్లో భారత్ టాప్ 8లో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో వుంది. ఇదివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మూడోస్థానానికి చేరింది. కానీ భారత్‌లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది కాబట్టి... త్వరలోనే బ్రెజిల్‌ని దాటి టాప్‌లో నిలిచే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments