Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన వృద్ధ దంపతులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (16:57 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ప్రాణాలపై ఆశలు వదిలు కోవాల్సిందేనని ప్రతి ఒక్కరూ చెబుతూ వచ్చారు. కానీ, కేరళ రాష్ట్రానికి చెందిన 93 యేళ్ళ వృద్ధుడు, 88 యేళ్ళ వృద్ధురాలి మాత్రం కరోనా మహమ్మారిని జయించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బీపీ, షుగ‌ర్‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లున్నప్పటికీ ఆ వృద్ధ దంపతులు ఈ వైరస్ నుంచి విముక్తి పొందారని పేర్కొంది. 
కేర‌ళ రాష్ట్రంలోని ప‌త‌నంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ద దంప‌తుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. అయితే ఇటీవ‌లే ఇట‌లీకి వెళ్లివ‌చ్చిన ఆ దంప‌తులు... త‌మ కుమారుడితో క‌లిసి భారత్‌కు తిరిగివ‌చ్చినట్లు అధికారులు గుర్తించారు. త‌ర్వాత వీరితో పాటు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. 
 
దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన స‌లహాలు క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించ‌డంతో వీరు ప్రాణాప్రాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని వైద్యులు తెలిపారు. మొత్తానికి మాన‌సికంగా ధృడంగా ఉంటే ఎంత‌టి మ‌హ‌మ్మారినైనా ఎదిరించ‌వ‌చ్చ‌ని ఈ వృద్ధ దంపతులు ప్రపంచానికి చాటిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments