గత 24గంటల్లో కొత్తగా 38903 కరోనా కేసులు.. 543 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:01 IST)
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 38903 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు ఒకే రోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1077618కి పెరిగింది. అలాగే. గత 24 గంటల్లో దేశంలో 543 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 26816కి పెరిగింది. 
 
అలాగే భారత్‌లో తాజాగా... కరోనా నుంచి 23672 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 677422కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 62.9గా ఉంది. విదేశాలతో పోల్చితే... ఇండియాలో రికవరీ రేటు బాగుంది.  
 
అయితే దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 300937 పాజిటివ్ కేసులు ఉండగా, తమిళనాడులో 165714 కేసులున్నాయి. ఇక ఢిల్లీలో 121582, కర్ణాటకలో 59652, గుజరాత్‌లో 47390, ఆంధ్రప్రదేశ్‌లో 44609, తెలంగాణలో 43780, బెంగాల్‌లో 40209 కేసులున్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో ఈమధ్య కరోనా జోరు బాగా ఉంది. 
 
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో కరోనా వేగంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లోకి వస్తే... దేశవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments