Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 24గంటల్లో కొత్తగా 38903 కరోనా కేసులు.. 543 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:01 IST)
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 38903 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు ఒకే రోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1077618కి పెరిగింది. అలాగే. గత 24 గంటల్లో దేశంలో 543 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 26816కి పెరిగింది. 
 
అలాగే భారత్‌లో తాజాగా... కరోనా నుంచి 23672 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 677422కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 62.9గా ఉంది. విదేశాలతో పోల్చితే... ఇండియాలో రికవరీ రేటు బాగుంది.  
 
అయితే దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 300937 పాజిటివ్ కేసులు ఉండగా, తమిళనాడులో 165714 కేసులున్నాయి. ఇక ఢిల్లీలో 121582, కర్ణాటకలో 59652, గుజరాత్‌లో 47390, ఆంధ్రప్రదేశ్‌లో 44609, తెలంగాణలో 43780, బెంగాల్‌లో 40209 కేసులున్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో ఈమధ్య కరోనా జోరు బాగా ఉంది. 
 
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో కరోనా వేగంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లోకి వస్తే... దేశవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments