Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ దుర్గ గుడిలో కరోనా కలకలం, సిబ్బందికి పెరుగుతున్న కేసులు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:44 IST)
కరోనావైరస్ అన్ని ప్రాంతాలలో తన ఉగ్ర పంజాను విసురుతున్నది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత పేరుగాంచిన ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఇక్కడ కరోనా సెగ తగిలింది. సిబ్బందికి నిర్వహించిన రెండుసార్లు పరీక్షలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
 
మిగిలిన వాటితో పోలిస్తే కేసులు తక్కువే అయినా ఒకసారి ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ బెజవాడ దుర్గగుడి సిబ్బందిని వణికిస్తోంది. ఇప్పటికే ఆలయంలో కీలక అధికారితో పాటు ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకి పాజిటివ్ రావడం ఇంద్ర కీలాద్రిపై చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండుసార్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించగా గతంలో ఓ వేదపండితుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.
 
అయితే వారకి కరోనాతో పాటు ఇతర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన వారు సురక్షితంగా బయట పడ్డారు. తాజాగా గత వారం దుర్గ గుడిలో రెండోసారి 393 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్ గా తేలింది. కాగా 450 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
 
కరోనా పరీక్షలు చేసేవరకు వ్యాధి బయట పడటం లేదు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండపై పరిస్థితి మారిపోయింది. ఆలయంలో రోజు శానిటైజ్ చేసినా, మాస్కులు ధరించినా రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడ్డారనే సమాచారం వస్తూ ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments