Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగోలో కరోనా టెర్రర్ - ఒక వ్యక్తి నుంచి 77 మందికి వ్యాప్తి

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా, పచ్చని పాడిపంటలతో కనిపించే గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా 77 మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దీంతో స్థానికలు హడలిపోతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ 19తో మృతి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఇప్పటివరకు సుమారు 77 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో జి మామిడాడలో 56మంది, బిక్కవోలు 13మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి మే 21వ తేదీన కరోనాతో మృతిచెందగా, అప్పటినుంచి వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
 
కాగా, కంటికి కనిపించని శత్రువుపై మన దేశంతోపాటు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 215 దేశాలకు పైగా ఈ వైరస్ సోకింది. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఎపుడు, ఎలా జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో మానవజాతికి ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. పైగా, ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి మందు లేకపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. అందుకే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష మంత్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జపిస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించ, ఇంట్లో నుంచి కాలు బయపెడితే ముఖానికి మాస్క్ విధిగా ధరించడం, బయటకెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. అయినా కొంతమంది ఈ విషయాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతుండటంతో ఈ వైరస్ బారినపడుతూ, మరికొంతమందికి అంటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments