Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండలో కరోనా వైరస్ చనిపోతుందా? ఆ ప్రొఫెసర్ ఏమంటున్నారు?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:48 IST)
కరోనా వైరస్ ఎండకు చనిపోతుందని చాలా మంది మదిలో ఉన్న భావన. అందుకే ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం పూట కొద్దిసేపు ఎండలో నిలబడాలని సలహా ఇస్తుంటారు. కానీ, ఫ్రాన్స్‌లోని మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రెమీ చారెల్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా బతికి ఉంటుందని చెప్పారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాపిస్తుందని అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 92 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని రెమీ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గంట సేపు దాన్ని పరిశోధించామని... అప్పుడు దాని వైరల్ కౌంట్ మాత్రమే తగ్గిందని, వ్యాప్తి చెందే శక్తి మాత్రం అలాగే ఉందని చెప్పారు.
 
56 నుంచి 60 డిగ్రీల మధ్య కరోనా వైరస్ శక్తి కొంత మాత్రమే తగ్గిందని రెమీ తెలిపారు. వైరస్ లు పరిస్థితులకు తగ్గట్టు మార్పు చెందుతూ ఉంటాయని చెప్పారు. యూరప్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు.
 
కాగా, ప్రపంచం మొత్తం ఉపుడు కరోనా గుప్పెట్లో చిక్కుకుని ఉన్న విషయం తెల్సిందే. ఈ వైరస్ బారినుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments