Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండలో కరోనా వైరస్ చనిపోతుందా? ఆ ప్రొఫెసర్ ఏమంటున్నారు?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:48 IST)
కరోనా వైరస్ ఎండకు చనిపోతుందని చాలా మంది మదిలో ఉన్న భావన. అందుకే ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం పూట కొద్దిసేపు ఎండలో నిలబడాలని సలహా ఇస్తుంటారు. కానీ, ఫ్రాన్స్‌లోని మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రెమీ చారెల్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా బతికి ఉంటుందని చెప్పారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాపిస్తుందని అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 92 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని రెమీ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గంట సేపు దాన్ని పరిశోధించామని... అప్పుడు దాని వైరల్ కౌంట్ మాత్రమే తగ్గిందని, వ్యాప్తి చెందే శక్తి మాత్రం అలాగే ఉందని చెప్పారు.
 
56 నుంచి 60 డిగ్రీల మధ్య కరోనా వైరస్ శక్తి కొంత మాత్రమే తగ్గిందని రెమీ తెలిపారు. వైరస్ లు పరిస్థితులకు తగ్గట్టు మార్పు చెందుతూ ఉంటాయని చెప్పారు. యూరప్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు.
 
కాగా, ప్రపంచం మొత్తం ఉపుడు కరోనా గుప్పెట్లో చిక్కుకుని ఉన్న విషయం తెల్సిందే. ఈ వైరస్ బారినుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments