Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:12 IST)
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే కరోనా వైద్యానికి అధిక ఫీజులను వసూలు చేస్తున్న కొన్ని ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు వేధిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాల‌ని పేర్కొంది.  
 
అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈటెల హెచ్చరించారు. ఫీజుల వివ‌రాల‌ను ఆస్ప‌త్రిలో కీల‌క ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని తెలంగాణ ఆదేశించింది. కరోనా వైద్యానికి ఉపయోగించే పీపీఈ కిట్ల ధరలు సైతం ప్రభుత్వం నిర్దారించిన ప్రకారమే అమ్మాలని తెలిపింది. 
 
పేషంట్లను ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు పూర్తి వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్పత్రులు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments