Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:12 IST)
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే కరోనా వైద్యానికి అధిక ఫీజులను వసూలు చేస్తున్న కొన్ని ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు వేధిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాల‌ని పేర్కొంది.  
 
అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈటెల హెచ్చరించారు. ఫీజుల వివ‌రాల‌ను ఆస్ప‌త్రిలో కీల‌క ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని తెలంగాణ ఆదేశించింది. కరోనా వైద్యానికి ఉపయోగించే పీపీఈ కిట్ల ధరలు సైతం ప్రభుత్వం నిర్దారించిన ప్రకారమే అమ్మాలని తెలిపింది. 
 
పేషంట్లను ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు పూర్తి వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్పత్రులు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

తెలుగులో టోవినో థామస్, త్రిష యాక్షన్ త్రిల్లర్ ఐడెంటిటీ

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

అభిమాని కుటుంబంలో వెలుగునింపిన రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments