Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు.. జగిత్యాలలో కలకలం

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (22:32 IST)
తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు ఉండటం ఇపుడు హైదరాబాద్ నగర వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో 19 మంది వలస కూలీలకు, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. అలాగే శుక్రవారం ముగ్గురు చనిపోగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 48కి చేరాయి. మరో ఏడుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మరో 670 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, జగిత్యాలలో కలకలం రేగింది. ఈ జిల్లాలో తొమ్మిది మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ తొమ్మిది మంది వలస కూలీలు ముంబై నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో ఈ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33కి చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments