Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona: ఉద్ధృతి కొద్దిగా తగ్గినా 40వేల పైనే కొత్త కేసులు

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (10:53 IST)
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి.

క్రితం రోజుతో పోల్చితే 4 శాతం మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
 
ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments