Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కలకలం సృష్టిస్తున్న ఈటా వైరస్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (09:37 IST)
భారత్‌లోకి మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ పేరు ఈటా. కరోనా వైరస్ మహమ్మారే కొత్త రూపందాల్చింది. బ్రిటన్‌లో ఇటీవలే కరోనా ఈటా వేరియంట్‌ను గుర్తించగా, ఇప్పుడీ నూతన రకం భారత్‌లోనూ వెలుగు చూసింది. 
 
కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా, ఈటా వేరియంట్ నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్టు గుర్తించారు. అయితే అతడు కొన్నిరోజులకే కోలుకున్నాడు. 
 
అయితే, ఆయన నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ఏ సీక్వెన్సింగ్ జరిపారు. దాంతో కరోనా రూపాంతరం చెందిన విషయం వెల్లడైంది. అతడితో సన్నిహితంగా ఉన్న గ్రామస్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
 
దేశంలో కరోనా రెండో దశ అల సమయంలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభించిన విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాటు, భారీగా మరణాలకు కారణమైంది. ఆపై డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందినా, దాని వల్ల ముప్పు తక్కువేనని పరిశోధకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments