Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్లక్ష్యం ఖరీదు.. ఒకే ఇంట్లో 25 మందికి కరోనా

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:24 IST)
మహారాష్ట్రలోని ఓ కుటుంబం అనుసరించిన నిర్లక్ష్యం వల్ల ఒకే ఇంట్లోకి 25 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని పరిశీలిస్తే, మహారాష్ట్ర‌లోని సంగ్లీ గ్రామానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. మార్చి 23వ తేదీన స్వగ్రామానికి తిరిగొచ్చారు. అయితే విదేశాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత 14 రోజుల‌పాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌న్న నిబంధ‌న‌ల మేర‌కు వారు హోమ్ క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. 
 
అయితే వారి ఇల్లు ఇరుకుగా ఉండ‌టం, ఆ ఇంట్లో 20 మంది నివాసం ఉండ‌టంవ‌ల్ల అంద‌రికీ క‌రోనా వైర‌స్ వ్యాపించింది. అయితే వారు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డంవ‌ల్ల ఇరుగుపొరుగు ఎవ‌ర‌కీ ఈ వైర‌స్ సోక‌లేదు. 
 
దీనిపై కలెక్టర్ అభిజిత్ చౌదరీ మాట్లాడుతూ.. ఇటువంటి కేసులను ఆరంభంలోనే గుర్తించడం ద్వారా మంచే జరిగిందని, ఒకే కుటుంబంలో ఇందరికి వైరస్ సోకిన విషయం ఆరంభంలోనే గుర్తించక‌పోతే వాళ్లు స్వేచ్ఛ‌గా సమాజంలో తిరిగేవారని, తద్వారా ఈ వైరస్ మరింత మందికి సోకేద‌ని అన్నారు. 
 
వైరస్ సోకిన 25 మందని సంగ్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి త‌ర‌లించామ‌ని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఏదిఏమైనా, ఇలాంటి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments