Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీలకు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (16:27 IST)
Mallikarjun Kharge-Veerappa Moily
సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వదిలిపెట్టట్లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌‌లో ఉన్నారని ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్‌ పేర్కొంది. కోవిడ్‌ బారిన పడిన మల్లికార్జున ఖర్గే  గత రెండు రోజుల పాటు తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకా తీసుకున్నారని, అయితే ప్రికాషన్‌ డోస్‌ తీసుకునేందుకు ఇంకా అర్హులు కాలేదని తెలిపింది. అంతేగాకుండా ఢిల్లీలోని ఖర్గే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
కాగా.. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గే పాల్గొన్నారు. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 10 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. 
 
ఇందులో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డి వైరస్‌ బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments