Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని..?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:50 IST)
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రధాన మంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితమని..  ప్రైవేట్‌లో 250 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు వారికి విజ్ఞప్తి చేశారు. 
 
ప్రస్తుతం 10 వేల ఫ్రీ వాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని... వాటిని 20వేలకు పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments