Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో వారణాసికి రావొద్దు.. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ చూపిస్తేనే..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మూడు సుప్రసిద్ధ దేవాలయాలకు ఏప్రిల్‌లో రావాలనుకునే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్నందువల్ల ఈ సలహా ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ మునుపెన్నడూ లేనంత అదికంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నెలలో వారణాసిలోని దేవాలయాలను సందర్శించేందుకు రావాలనుకుంటున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. దేశీయ, అంతర్జాతీయ భక్తులు ఏప్రిల్‌లో వారణాసికి రావద్దని కోరారు.
 
వారణాసి డివిజినల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వనాథ్ దేవాలయం, సంకట మోచన దేవాలయం, అన్నపూర్ణ దేవాలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించాలని చెప్పారు. వారణాసిలో ప్రవేశించడానికి ముందు మూడు రోజుల్లో ఈ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలని చెప్పారు. నగరంలోని హోటళ్ళకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు

తెలుగులోనే ఎక్కువ అభిమానులున్నారు, అందుకే మ్యూజికల్ కాన్సర్ట్ : సిధ్ శ్రీరామ్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments