Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు.. కంబోడియా

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:09 IST)
కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరలా దిగుమతులకు ఒకే చెప్పింది. భారతదేశంలో ఉన్న వస్తువులు, ఇతరత్రా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో… భారత్ నుంచి గేదె మాంసం కంటైనర్లలో కంబోడియాకు ఎగుమతి అయ్యాయి. 
 
కానీ…ఈ మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు నిర్ధారించడంతో మూడు కంటైనర్లను నిలిపివేసింది. ఓ ప్రైవేటు సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు, ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించారు. 
 
కంబోడియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం కొత్తగా 685 కరోనా కేసులు నిర్ధారించారు. 19 మంది చనిపోయారు. 74 వేల 386 కేసులున్నాయి. మొత్తం వేయి 324 మంది చనిపోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments