Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల కోసం తన కార్యాలయాన్ని ఐసియూగా మార్చిన షారూక్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:30 IST)
కరోనా సమయంలో చాలామంది హీరోలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఒకరు. ముంబై లోని తన కార్యాలయాన్ని కరోనా బాధితుల కోసం ఐసీయుగా మార్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు.
 
అందులో అక్షయ్, సోనూ సూద్ వంటి వారు కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నారు. షారుక్ ఖాన్ తన స్టార్‌డమ్‌ను సరైన విషయాల కోసం ఉపయోగించటానికి ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు. షారూక్ తన కార్యాలయంలో 15 పడకల ఐసియును ఏర్పాటు చేశారు. దీంతో 66 మంది కరోనా బాధితులను అక్కడ చేర్చారు.
 
వారిలో 54 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. షారూక్ ఖాన్ యొక్క మీర్ పౌండేషన్, హిందుజా హాస్పిటల్ మరియు బిఎంసి సహకారంతో 15 పడకల ఐసియు సిద్ధమయ్యింది. ఖార్ లోని హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను కలిగి వుందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లైన్లతో క్లిష్టమైన రోగులకు సేవలు అందిస్తున్నామని ఖార్ లోని హిందుజ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments