Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ సోనూసూద్, మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

Webdunia
శనివారం, 30 మే 2020 (21:08 IST)
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం వారివారి ఇళ్లకు వెళ్దామంటే ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఆకలితో అలమటిస్తున్నారు.
 
ఇలాంటివారిని పెద్దమనసు గల సెలబ్రిటీలు ఆదుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబు, చిరంజీవి తదితర హీరోలు తమవంతు సాయం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే... నటుడు సోను సూద్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని ముంబైలోని రాజ్ భవన్‌లో కలిశారు. వలస వచ్చిన ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి, వారికి ఆహారాన్ని అందించడానికి తను చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. సోను సూద్ చేస్తున్న సహాయకార్యక్రమాలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments