Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నియంత్రణకు రంగం సిద్ధం... అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (19:58 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కోవిడ్ నియంత్రణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, డీజీసీఏ ఆమోదం పొందిన విమాన సేవలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
 
గత ఏడాది జూన్‌ 26న అంతర్జాతీయ కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జారీ అయిన ఉత్తర్వుల అమలును మార్చి 31 అర్ధరాత్రి వరకూ పొడిగించామని డీజీసీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
 
అయితే ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు అనుమతిస్తామని డీజీసీఏ తెలిపింది. కరోనా కట్టడికి గత ఏడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించేందుకు గత ఏడాది మే నుంచి భారత్‌ పలు దేశాల నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక విమానాలను నడిపింది. అమెరికా, బ్రిటన్‌, దుబాయ్‌, ఫ్రాన్స్‌ సహా 24 దేశాలతో విమాన సర్వీసులను నడిపేందుకు ఒప్పందాలు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments