Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్తరకం వైరస్‌కు సంబంధించి చర్చించేందుకు సోమవారం ఉదయం ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని భేటీకి కేంద్రం పిలిచింది. స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై కేంద్రం చర్చించనుంది. 
 
ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓలోని భారత ప్రతినిధి రోడరికో హెచ్‌ ఓఫ్రిన్‌ హాజరు కానున్నారు. బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆదివారం లండన్‌లో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. స్ట్రెయిన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే యూకే నుంచి విమానాల నిషేధంపై భారత్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments