Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా : 2 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 మే 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కూడా మరో 50 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు సంఖ్య 1980కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,010గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, గుంటూరులో 6, కడపలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 5, కర్నూలులో 13, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 566కి చేరింది.
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తే, అనంతపురం 107, చిత్తూరు 112, ఈస్ట్ గోదావరి 15, గుంటూరు 382, కడప 97, కృష్ణ 339, కర్నూలు 566, నెల్లూరు 101, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 63, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments