Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా : 2 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 మే 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కూడా మరో 50 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు సంఖ్య 1980కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,010గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, గుంటూరులో 6, కడపలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 5, కర్నూలులో 13, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 566కి చేరింది.
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తే, అనంతపురం 107, చిత్తూరు 112, ఈస్ట్ గోదావరి 15, గుంటూరు 382, కడప 97, కృష్ణ 339, కర్నూలు 566, నెల్లూరు 101, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 63, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments