Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య కరోనా మందు ఎఫెక్ట్: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో 80 మంది రోగులు

Webdunia
శనివారం, 29 మే 2021 (13:15 IST)
కృష్ణపట్నంలో కరోనా నిరోధించేందుకు ఆనందయ్య నాటు మందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల బాదుడు దెబ్బ ఒకవైపు, ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఇంకోవైపు కలిసి కొందరు నాటు మందును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆనందయ్య మందుకు బీభత్సమైన ప్రచారం జరగడంతో అక్కడకు ఒక్కసారిగా వేలమంది మందు కోసం పరుగులు తీసారు.
 
ఐతే ఆ మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందని కొందరు అంటుంటే మరికొందరు ఆ మందు దుష్ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 80 మంది నాటు మందు తీసుకున్న కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా కళ్లు మంటలు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఆసుపత్రుల్లో చేరారు.
 
ఈ నేపధ్యంలో ఆనందయ్య మందు ఎంతమేరకు పనిచేస్తుందన్నది నిగ్గు తేల్చాలని సిపిఎ డిమాండ్ చేస్తోంది. నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని వాకబు చేసారు. ప్రభుత్వం ఇస్తున్న చికిత్సలపై నమ్మకం లేకనే ప్రజలు ఇలా నాటుమందులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments