Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వారం రోజులు ఆస్పత్రిలోనే అమితాబ్ బచ్చన్, అభిషేక్..

Webdunia
బుధవారం, 15 జులై 2020 (10:52 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. బిగ్ బి, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బిగ్ బి కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 
 
అమితాబ్, అభిషేక్‌ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా బిగ్‌ బి కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినిమా తారలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. 
 
మరోవైపు బిగ్ భార్య జయాబచ్చన్‌కు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా హోం ఐసోలేషన్లో వున్నారు. అమితాబ్ వయసు 77 ఏళ్లు. కరోనా లక్షణాలు తొలి దశలోనే ఉన్నా, ఈ వయసులో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అమితాబ్‌కి వయసు మీద పడినా యాక్టివ్‌గా వున్నారని, కరోనా లక్షణాలు తక్కువగా వున్నా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలోనే చేరి బిగ్ బి అమితాబ్ చికిత్స పొందుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అమితాబ్ సినిమా కార్మికులకు ఎంతో సాయం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments