తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది గడిచింది..

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:57 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. గత ఏడాది తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి అయ్యింది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటినీ చిగురుటాకులా వణికించింది కరోనా వైరస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2న కరోనా తొలి కేసు నమోదైంది. అంటే నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత కేసుల సంఖ్య వేలల్లో, లక్షల్లో పెరిగింది. 
 
ముఖ్యంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం పాటించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే వచ్చేది. ఆ తర్వాత అక్టోబర్‌, నవంబర్ నుంచి కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆంక్షలు ఎత్తివేసింది. అన్‌లాక్‌ ప్రక్రియతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరింది.
 
ఇక డిసెంబర్‌లో కొత్త స్ట్రెయిన్‌, కరోనా సెకండ్‌ వేవ్‌ అని హెచ్చరించినా తెలంగాణలో వాటి ప్రభావం కనిపించలేదు. కరోనా తగ్గిపోయింది రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోయింది. మనకేం కాదులే అన్న ధీమాతో చాలా మంది మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం మానేశారు. 
 
మరోవైపు కొవిడ్‌ టీకా కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రజలు వైరస్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం మొదలైంది. జనవరిలో తెలంగాణలో 4వేల 79 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఫిబ్రవరి వచ్చే సరికి ఆ సంఖ్య 8వేల 29కి పెరిగింది.
 
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2లక్షల 98వేల 923 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఒక వేయి 634 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments