Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా, విద్యార్థుల వసతి గృహాల్లో ఈ వైరస్ విజృంభిస్తుంది. తాజాగా మరో 42 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. 
 
సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీకి చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మొత్తం 42 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఈ కాలేజీలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులకు 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో 42 మంది విద్యార్థులకు, ఓ టీచర్‌కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన విద్యార్థులందరినీ హౌం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments