Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా, విద్యార్థుల వసతి గృహాల్లో ఈ వైరస్ విజృంభిస్తుంది. తాజాగా మరో 42 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. 
 
సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీకి చెందిన అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మొత్తం 42 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఈ కాలేజీలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులకు 27 మంది సిబ్బందికి ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో 42 మంది విద్యార్థులకు, ఓ టీచర్‌కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన విద్యార్థులందరినీ హౌం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments