Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి సంతాప విందు ఫలితం .... 26 వేల మందికి హోం క్వారంటైన్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:47 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి మృతికి సంతాపంగా ఇచ్చిన విందుకు హాజరైన 26 వేల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నిజానికి ఈ సంతాప విందుకు 1200 మంది హాజరయ్యారు. కానీ, 26 వేల మందిని హోంక్వారంటైన్‌కు తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురేనా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో మార్చి 17వ తేదీన దుబాయి నుంచి సొంతూరుకు వచ్చాడు. ఆ తర్వాత అంటే మార్చి 20వ తేదీన తమ సంప్రదాయం ప్రకారం తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది వరకు హాజరయ్యారు. 
 
ఇంతవరకు బాగానేవుంది... మార్చి 27వ తేదీన విందు ఇచ్చిన వ్యక్తితో పాటు.. అతని భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు... అతనివద్ద వివరాలు సేకరించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments