Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి సంతాప విందు ఫలితం .... 26 వేల మందికి హోం క్వారంటైన్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:47 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి మృతికి సంతాపంగా ఇచ్చిన విందుకు హాజరైన 26 వేల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నిజానికి ఈ సంతాప విందుకు 1200 మంది హాజరయ్యారు. కానీ, 26 వేల మందిని హోంక్వారంటైన్‌కు తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురేనా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో మార్చి 17వ తేదీన దుబాయి నుంచి సొంతూరుకు వచ్చాడు. ఆ తర్వాత అంటే మార్చి 20వ తేదీన తమ సంప్రదాయం ప్రకారం తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది వరకు హాజరయ్యారు. 
 
ఇంతవరకు బాగానేవుంది... మార్చి 27వ తేదీన విందు ఇచ్చిన వ్యక్తితో పాటు.. అతని భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు... అతనివద్ద వివరాలు సేకరించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments