Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. 229 మంది హాస్టల్ విద్యార్థులకు పాజివిట్

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:19 IST)
మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని ఏరియాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ, కొత్త కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలావుంటే, గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, కరోనా తగ్గుతోందన్న కారణంగా ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. వాటితోపాటే హాస్టళ్లూ తెరుచుకున్నాయి. ఎక్కడ తేడా కొట్టిందో గానీ.. 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ హాస్టల్ లో 200 మందికిపైగా కరోనా సోకి కలకలం రేపింది.
 
వాషిం జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థులు, సిబ్బంది సహా 232 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
 
పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందులోనూ ఒక్క అమరావతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments