Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్.. ఒమిక్రాన్ టెన్షన్‌

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:30 IST)
Hyderabad
హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

 
పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే వారికి సోకిన కరోనా వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

 
విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది కరోనా డెల్టా వేరియంటా.. లేక ఒమిక్రాన్ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments