హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్.. ఒమిక్రాన్ టెన్షన్‌

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:30 IST)
Hyderabad
హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

 
పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే వారికి సోకిన కరోనా వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

 
విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది కరోనా డెల్టా వేరియంటా.. లేక ఒమిక్రాన్ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments