Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని ప్లే గ్రౌండ్స్‌లో ఆడనివ్వండి.. ఆరోగ్యంగా ఉంచండి!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2015 (15:43 IST)
క్రీడల వల్ల పిల్లలకు చాలా లాభాలున్నాయి. ఆటలు పిల్లల జీవితాలలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. క్రీడల వల్ల పిల్లలకు ఎన్నో ఉపయోగాలున్నాయి. నిజానికి, పిల్లలని ప్లేగ్రౌండ్‌కు అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యకరంగా మీ పిల్లలు ఉండాలంటే వారికి క్రీడలను అలవాటు చేయాలి. ఈ తరం పిల్లలు క్రీడలను దూరంగా ఉంచడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు. 
 
దీనికి కారణం పాఠశాలలో మైదానాలు లేకపోవడం, ఇంట్లో ఆడుకుందామంటే సరైన స్థలాలు లేకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల పిల్లలు అలుపెరగకుండా ఊబకాయ సమస్యతో బాధపడుతు‌న్నారు. అటువంటి సమస్యలను అధిగమించాలంటే కచ్చితంగా పిల్లలకంటూ క్రీడలలో పాల్గొనే అలవాటు చేయాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. పిల్లలు నిత్యం అలుపెరిగేలా ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలలో వెల్లడించారు. 
 
తల్లితండ్రులుగా, పిల్లలకు క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలని మీరు తప్పక తెలుసుకోవాలి. మీ పిల్లలకి శ్రమ కలిగేలా ఆడించాలి. ఆటలంటే వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ లాంటివి కాకుండా శారీరక శ్రమ కలిగించే ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడించాలి. పిల్లలకి ఆటలు దూరంగా ఉంచడమంటే వారిని ఆరోగ్యం నుంచి దూరంగా ఉంచడమేనని తేటతేల్లమవుతుంది. క్రీడలలో పాల్గొనే పిల్లలు అన్నింట్లోను చురుగ్గా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేగాక పిల్లలు చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటారు. క్రీడల వల్ల కలిగే ఉపయోగాల గురించి చూద్దాం. 
 
* క్రీడలలో పాల్గొనే పిల్లలు చురుగ్గా ఉంటారు. వివిధ అంశాలపై ఫోకస్ ను మెయింటైన్ చేయగలుగుతారు.
* ఆటలు, వ్యాయామం మూలంగా శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక బరువు ఊబకాయం నుండి విముక్తి కలుగుతుంది. దీంతో  పిల్లలు అధికబరువు పెరగకుండా నాజూగ్గా ఉంటారు.
* నడక, జాగింగ్, చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతుంది.
* ఆటల వల్ల మధుమేహవ్యాధి సమస్యలు రావు.
* శారీరకంగా ఫిట్‌గా ఉన్న పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిపనులలో చురుగ్గా ఉంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments