Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (21:59 IST)
విరుదునగర్ జిల్లాలోని రామస్వామి రాజా నగర్‌లోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే ప్రాణవాయువును జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు. 
 
ఈ ప్లాంట్‌ను ప్రజా సంక్షేమం, ప్రజా వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయును రాజపాళెయం, విరుదునగర్, శివకాశి, అరుబ్బుకోట్టై, సాత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
 
ఈ ప్లాంట్‌ను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ సమక్షంలో ఈ ప్లాంట్‌ను విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కణ్ణన్ ప్రారంభించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా రోజుకు... 45 లీటర్ ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనుంది. 
 
ఇది వాయు రూపంలో 7 వేల లీటర్ల ప్రాణవాయుకు సమానం. నిమిషానికి 10 లీటర్ల చొప్పున ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఒక రోగికి 10 నుంచి 12 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ ద్వారా ఒక రోజుకు 24 ప్రాణాలను రక్షించవచ్చు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments