Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారితో చనువుగా ఉంటుందనీ భార్యను కడతేర్చిన భర్త

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (14:09 IST)
పనిచేసే ప్రదేశంలో మరో ఇద్దరితో భార్య చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన భర్త... ఆమెను కడతేర్చాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన మీంజూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీంజూరుకు చెందిన మీనాకు చెన్నైకి చెందిన ముత‌రాస‌న్‌ను కొన్నేండ్ల కింద‌ట వివాహమైంది. మీనా ప్ర‌వ‌ర్త‌న‌పై ముత‌రాస‌న్ అనుమానం పెంచుకోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతుండేవ‌ని స్ధానికులు చెబుతున్నారు. 
 
అదేసమయంలో ప‌నిచేసే ప్ర‌దేశంలో మీనా ఇత‌ర వ్య‌క్తుల‌తో చ‌నువుగా ఉండ‌టం ముత‌రాస‌న్‌కు ఏమాత్రం నచ్చలేదు. పైగా, అతనిలో అనుమానం బ‌ల‌పడేలా చేసింది. అంతే ఆమెను కడతేర్చాడు. 
 
వివాహిత మృత‌దేహం మింజూర్ వ‌ద్ద ఓ గుడి స‌మీపంలో శ‌నివారం రాత్రి ల‌భ్య‌మైంది. స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మ‌హిళ గొంతుపై పెనుగులాడిన గుర్తులు ఉండ‌టంతో భ‌ర్తే ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మ‌హిళపై ఆభ‌ర‌ణాలు అలాగే ఉండ‌టం, హ‌త్య త‌ర్వాత భ‌ర్త క‌నిపించ‌కుండా పోవ‌డంతో పోలీసులు ఆయ‌న‌ను అనుమానిస్తున్నారు. అలాగే, మృతురాలు హత్యకు గురైన స్థలంలోనే ఆమె చనువుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారనీ వారిని చూడగానే ముతరాసన్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకునిరావడంతో ఈ దారణానికి పాల్పడివుంటాడని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments