Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చంపి శవంతో సెల్ఫీ... వాట్సప్‌లో షేర్...

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:56 IST)
గంజాయి దమ్ము బిగించి కొడితే... అనే పాటలో మాదిరిగా ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థం గంజాయి మత్తులో కొట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకడు రాక్షసుడిగా మారిపోయి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా మద్యం సీసాతో గొంత కోసి ఆ తర్వాత పొడిచేశాడు. ఇంకా కసి తీరక అతడి ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో సెల్ఫీ దిగి తన మిగిలిన స్నేహితులకు షేర్ చేసేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ పోలీసు స్టేషనుకి కూత వేటు దూరంలో ముగ్గురు యువకులు గంజాయి సేవించారు. ఈ క్రమంలో ఏదో విషయం దగ్గర కార్తీక్, కుబేష్ మధ్య వాదన జరిగింది. అసలే గంజాయి మత్తులో వుండటంతో అతడు మరింత ఆగ్రహావేశానికి గురై దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో కార్తీక్ సెల్ఫీ దిగి శవాన్ని అక్కడో గోతిలో పూడ్చి పెట్టేశాడు. ఇతడికి మరో స్నేహితుడు కూడా సాయం చేశాడు. 
 
ఐతే వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి వచ్చేటపుడు ఇద్దరే రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో గొయ్యి తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అక్కడ తవ్వి చూడగా యువకుడి శవం లభించింది. మరోవైపు వాట్సప్‌లో షేర్ అయిన ఫోటోలు కూడా పోలీసుల దృష్టికి రావడంతో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments