పుష్యమి నక్షత్రం.. 1వ పాదములో పుట్టిన వారైతే..?

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (18:54 IST)
పుష్యమి మొదటి పాదంలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. పుష్యమి తొలి పాదంలో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్ధశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని వేద పండితులు చెపుతున్నారు. 
 
అలాగే 19 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చ రత్నమును బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలికి ధరిస్తే శుభ ఫలితాలుంటాయి. పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన జాతకులు 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్ధశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
 
అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి. ఇకపోతే.. 63-69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 
 
ఇదేవిధంగా 69-79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించగలరు. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని రత్నాల శాస్త్రం చెబుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భాగ్యనగరి వాసులకు శుభవార్త - జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు

సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్

బీజేపీతో అక్రమ సంబంధం బయటపడింది... జగన్ గారి తెర తొలగింది : వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ఆదేశాలివ్వడం తప్పు: బొలిశెట్టి సత్యనారాయణ

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

Show comments