Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థులకు 'ఉపకారం' లేనట్టేనా? సీఎం జగన్ మాయ?!

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:32 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అన్యాయం చేయనున్నారా? అందుకే గత ఎనిమిది నెలలుగా వారికి చెల్లించాల్సిన ఉపకారవేతనాలను చెల్లించకుండా ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు ఇంటర్ విద్యార్థులు. 
 
ముఖ్యమంత్రి జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా తల్లులకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రం రూ.15 వేలు అందించారు. ఇదే అదనుగా చూపి.. ఇంట్లో ఎంతమంది చదివితే అందరికీ ఇవ్వాల్సిన ఉపకారవేతనాలకు మంగళం పాట పాడనున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఇంటర్‌ చదువుతుంటే స్కాలర్‌షిప్‌ రూపంలో ఒక్కొక్కరికి రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు వచ్చేవి. 'అమ్మ ఒడి' పథకంలో భాగంగా ఇంటికి ఒక్క విద్యార్థికి మాత్రం రూ.15 వేలు అందించారు. కానీ, స్కాలర్‌షిప్‌ ఊసెత్తడంలేదు. ఇది ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అవకాశాలను దెబ్బతీస్తోందని అంటున్నారు. 
 
ఇప్పటివరకు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల గురించి కాలేజీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అమ్మఒడిని ప్రవేశపెట్టి, ఇంటర్‌ స్థాయిలో స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారని వార్తలు రావడంతో విద్యార్థులపై ఒత్తిడిని పెంచేశాయి. అలాగే, విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments