జేఈఈ 2025 మెయిన్స్‌ : ఎన్టీఏ కీలక ప్రకటన

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:22 IST)
వచ్చే విద్యాసంవత్సరం (2025-26)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) (మెయిన్) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రటించింది. ఈ పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. 
 
జనవరి నెలలో జేఈఈ సెషన్-1 ను, ఏప్రిల్ నెలలో సెషన్-2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబరు 28 నుండి నవంబరు 22 వరకు జనవరి సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనుంది. ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
 
సెషన్-2కి సంబంధించి జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఫలితాలను 2025 ఏప్రిల్ 17లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments