Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో స్టీఫిన్ హాకింగ్స్ ... 3 సబ్జెక్టుల్లో 100కి వంద వరకూ మార్కులు... కానీ కన్నీళ్లే...

Webdunia
బుధవారం, 8 మే 2019 (12:18 IST)
రెండేళ్ళ వయస్సు నుంచి జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతూ చనిపోయిన నోయిడా విద్యార్థి తను రాసిన మూడు పరీక్షల్లో దాదాపు వంద మార్కులు సాధించాడు. ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల్లో నోయిడాకు చెందిన వినాయక్ శ్రీధర్ రాసిన మూడు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
 
ఈ విద్యార్థికి ఇంగ్లీషులో వందకు వంద, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 చొప్పున మార్కులు రాగా, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాయకుండానే చనిపోయాడు. ఆ విద్యార్థి రాసిన మూడు పరీక్షల్లో దాదాపు వంద మార్కులు సాధించడం గమనార్హం. 
 
పదో తరగతి సీబీఎస్ఈ ఫలితాలను ఈనెల పదో తేదీన సోమవారం వెల్లడించారు. నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి పరీక్షలను కూడా చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడీ కేటగిరీ కింద పరీక్షలు రాయకుండా సాధారణ కేటగిరీలోనే పరీక్షలు రాశారు. 
 
దీనిపై బాధితుని తల్లి మమతా శ్రీధర్ మాట్లాడుతూ, తన కుమారుడు కుర్చీకే పరిమితమైనప్పటికీ.. అతని జ్ఞాపకశక్తి మాత్రం అపారమన్నారు. అందుకే పరీక్షలను కూడా స్వయంగా తనే రాశాడని చెప్పాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫిన్ హాకింగ్స్ మాదిరిగానే తన కుమారుడు కూడా తన పనులు తానే చేసుకునేవాడనీ, అతడు వ్యోమగామి కావాలని పరితపించేవాడనీ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments