జేఈఈ సెషన్-2 ఫలితాలు విడుదల

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (10:29 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. 
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఆగస్టు 8) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 
 
జేఈఈ మెయిన్స్‌ ద్వారా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఆగస్టు 28న జరగనుంది.
 
ఈసారి కటాఫ్ అంచనాలు :
జనరల్ అభ్యర్థులకు 87.89
ఈడబ్ల్యూఎస్ 66.22
ఎస్సీలకు 46.88
ఎస్టీలకు 34.67
 
ఈసారి జేఈఈ పరీక్షను ఎన్‌టీఏ రెండు సెషన్లలో నిర్వహించింది. మొదటి సెషన్ జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఈ సెషన్ ఫలితాలను జూలై 12న విడుదల చేశారు. 
 
మొదటి సెషన్‌కు మొత్తం 8,72,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రెండో సెషన్ జూలై 25 నుంచి జూలై 30 వరకు నిర్వహించారు. 
 
ఈ సెషన్‌కు 6,29,778 మంది హాజరయ్యారు. విద్యార్థులు రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. రెండింటిలో బెస్ట్‌ మార్క్స్‌ను మెరిట్‌గా పరిగణిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు

సినిమా పబ్లిసిటీ కోసం పచ్చిబూతులతో పాట, బరాబర్ ప్రేమిస్తా నటుడి నిర్వాకం

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments