Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ సెషన్-2 ఫలితాలు విడుదల

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (10:29 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. 
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఆగస్టు 8) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 
 
జేఈఈ మెయిన్స్‌ ద్వారా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఆగస్టు 28న జరగనుంది.
 
ఈసారి కటాఫ్ అంచనాలు :
జనరల్ అభ్యర్థులకు 87.89
ఈడబ్ల్యూఎస్ 66.22
ఎస్సీలకు 46.88
ఎస్టీలకు 34.67
 
ఈసారి జేఈఈ పరీక్షను ఎన్‌టీఏ రెండు సెషన్లలో నిర్వహించింది. మొదటి సెషన్ జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఈ సెషన్ ఫలితాలను జూలై 12న విడుదల చేశారు. 
 
మొదటి సెషన్‌కు మొత్తం 8,72,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రెండో సెషన్ జూలై 25 నుంచి జూలై 30 వరకు నిర్వహించారు. 
 
ఈ సెషన్‌కు 6,29,778 మంది హాజరయ్యారు. విద్యార్థులు రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. రెండింటిలో బెస్ట్‌ మార్క్స్‌ను మెరిట్‌గా పరిగణిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments