జూలై 20 నుంచి జేఈఈ మెయిన్ 2021

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (20:44 IST)
జేఈఈ మెయిన్ విద్యార్థులు పరీక్ష తేదీలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ మూడో దశ, నాలుగో దశపరీక్షలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేశారు. జేఈఈ మెయిన్ 2021 మూడో సెషన్ పరీక్షలు 2021 జూలై 20 నుంచి 25 తేదీ వరకు జరుగుతాయి. ఇక నాలుగో సెషన్ పరీక్షలు 2021 జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయి. 
 
దరఖాస్తు విండోను మళ్లీ ఓపెన్ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మూడో దశ అంటే ఏప్రిల్ సెషన్ పరీక్షకు జూలై 6 నుంచి జూలై 8 వరకు, నాలుగో దశ అంటే మే సెషన్ పరీక్షకు జూలై 9 నుంచి 12 వరకు దరఖాస్తు చేయొచ్చు. 
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్ 2021 సెషన్స్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడో దశ, నాలుగో దశ పరీక్షలపై అనేక వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments