Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020-21 అకాడమిక్ ఇయర్.. ఐఐటీ క్లాసులు డిసెంబరులో ప్రారంభం

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:24 IST)
ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తున్న తరుణంలో దేశంలో పలు పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్తగా బీటెక్‌లో చేరే విద్యార్థులకు డిసెంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఐఐటీల పునఃప్రారంభం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఐఐటీ డైరెక్టర్లతో ఐఐటీ కౌన్సిల్‌ నియమించిన ఉపసంఘం ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదిక సమర్పించింది. అవకాశం ఉంటే మొదట పీహెచ్‌డీ విద్యార్థులను క్యాంపస్‌లకు రప్పించాలని నివేదికలో సూచించింది. ఇంకొంత వెసులుబాటు ఉంటే ఈ ఏడాది చేరే విద్యార్థులకు అవకాశం కల్పించాలని నివేదికలో సూచించింది.
 
పాత విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో బోధించాలని, కొత్త విద్యార్థులకు డిసెంబర్‌లో తరగతులు ప్రారంభమైనా శనివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహించి విద్యాసంవత్సరం పూర్తయ్యేలా చూడాలని పేర్కొంది. ఈ నివేదికపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments