Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల వెల్లడి ఎపుడంటే....?

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (15:43 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌‍డేట్ వచ్చింది. ఈ ఫలితాలను ఈ నెల 20వ తేదీ తర్వాత వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఈ యేడాది ఫిబ్రవరి - ఏప్రిల్‌ నెలల మధ్యలో ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఆయా స్టేట్ బోర్డు కింద పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు మాత్రం వెల్లడవుతున్నాయి.
 
అలాగే, సీబీఎస్ఈ విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రిజల్ట్స్‌కు సంబంధించి ఫేక్‌ సమాచారం చక్కర్లు కొడుతోన్న వేళ బోర్డు స్పందించింది. ఇటీవలే ఆ నకిలీ సమాచారాన్ని ఖండించిన సీబీఎస్‌ఈ అధికారులు.. మే 20 తర్వాతే ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ యేడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వరకు జరగ్గా.. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments