Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయం ఉద్యోగాలు.. 27న అపాయింట్‌మెంట్ లెటర్స్..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:43 IST)
సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 27న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా, సెప్టెంబర్ 27న అర్హత సాధించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని భావిస్తోంది.
 
దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత సాధించిన వారి పూర్తి వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపామని, త్వరలోనే కాల్ లెటర్స్ కూడా పంపుతామన్నారు. మొదట ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తారు.
 
అపాయింట్‌మెంట్ లెటర్స్ రావడానికి ముందు పాసైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ వస్తాయి. ప్రభుత్వం కోరిన సర్టిఫికెట్లను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఇందులో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు అభ్యర్థి పొందుపరిచిన ఈమెయిల్‌కు కూడా సమాచారం పంపుతారు.
 
కాగా సెప్టెంబరు 19న గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను జిల్లాలకు పంపించారు. ఆయా జిల్లాల్లోని కమిటీలు ఆయా వివరాలను పరిశీలించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం మెరిట్ జాబితాలను రూపొందించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments