Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:01 IST)
బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు.
 
ఇప్పటికే ఆర్థిక అక్రమాస్తుల కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి మాల్యా దేశం వదలి బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 
 
ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ్ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీఐపీ స్టాండ్‌లో కూర్చుని వీక్షించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments