Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా మూతపడుతున్న ఏటీఎంలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (14:34 IST)
దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి. గడిచిన రెండేళ్ళకాలంలో ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. 
 
ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి. 
 
గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును పెంచాయి. అప్పట్లో ప్రతి 10,832 మందికి ఒక ఏటీఎం అందుబాటులో ఉంటే 2017 నాటికి ప్రతీ 5,919 మంది ఖాతాదారులకు ఒక ఏటీఎం చొప్పున అందుబాటులోకి వచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఏటీఎం కేంద్రాలు మూతపడటం విచిత్రంగా ఉందని భారత రిజర్వు బ్యాంకు పేర్కొంది. నిజానికి బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments