Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1299కే విమాన టిక్కెట్ : మాన్‌సూన్ సేల్ పేరుతో విస్తారా ఆఫర్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (21:41 IST)
దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న మరో ప్రైవేట్ విమానయాన సంస్థ విస్తారా. ఈ సంస్థ దేశంలోని పలు నగరాలను విమాన సర్వీసులను నడుపుతోంది. ఇపుడు మాన్‌సూన్ సేల్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్‌లో రూ.1299కే టిక్కెట్ ధరను ప్రకటించింది. అయితే, ఈ టిక్కెట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారు జూలై 3వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ మధ్య ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. 
 
కాగా, ఇటీవల విస్తారా సంస్థకు 62 కొత్త విమానాలు వచ్చి కలిశాయి. దీంతో విమానాల సంఖ్య 170కి చేరింది. ఈ సంస్థ ప్రతి రోజూ 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి 10 నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్‌సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments