Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్తంభించిన ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యాప్ సేవలు...

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (14:18 IST)
యూపీఐ పేమెంట్స్‌ సేవలకు మరోమారు అంతరాయం కలిగింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పని చేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
యూపీఐ చెల్లింపులు జరగడం లేదని, నెట్‌వర్క్ స్లో అని వస్తుందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వేల మంది యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ తెలిపింది. 
 
ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్‌‍లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా, సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని, ఎన్.పి.సి.ఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన కూడా ఇదే తరహాలో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడగా శనివారం మరోమారు అంతరాయం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments