Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌లాక్ 4.0 ప్రక్రియ... మెట్రో రైలు సేవలు ప్రారంభమౌతాయా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (19:06 IST)
అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మెట్రో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అనుమతించాలంటూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మెట్రో ప్రారంభం అంశం తెరపైకి రావడం గమనార్హం. 
 
ఇంకా కరోనా వైరస్ కారణంగా మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు హోమ్‌శాఖ వర్గాలు తెలిపాయి.
 
ఆగస్టు 31తో అన్‌లాక్‌ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో 4.0కు సంబంధించి కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి మెట్రో సేవలను అనుమతించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వీటితో పాటు మరికొన్ని ప్రజా రవాణా, ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
అయితే, స్కూళ్లు, కళాశాలలు మాత్రం ఇప్పటికిప్పుడే ప్రారంభించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. అలాగే బార్లను తెరవకుండా కేవలం మద్యాన్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు.  

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments